13 April, 2026 | 3:39 PM

మందలపల్లిలో అరైవ్ అలైవ్ కార్యక్రమం

13-04-2026 02:07 PM

దమ్మపేట, ఏప్రిల్ 13(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 99 రోజుల ప్రణాళిక "ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక" కార్యక్రమంలో భాగంగా సోమవారం నుండి వారం రోజులు పాటు రోడ్డు భద్రత వారోత్సవాలను Arrive alive కార్యక్రమంలో భాగంగా దమ్మపేట మండల పరిధిలోగల అన్ని గ్రామ పంచాయతీలలో విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసి, వారి ఆధ్వర్యంలో పోలీసు వారి పర్యవేక్షణలో అన్ని గ్రామ పంచాయతీలలో రోడ్డుకి ఇరువైపులా గల చెట్ల పొదలను తొలగించి, గుంతలను పూడ్చడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాణాలు పాటించాలని దమ్మపేట మండల ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి, అదనపు ఎస్ఐ బాలస్వామి, పోలీస్ సిబ్బంది అలాగే గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్లు, విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు.