01-12-2025 11:08:22 PM
భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ డెవలపర్ ఏఎస్బీఎల్ తమ గ్లోబల్ ఔట్ రీచ్ సిరీస్లో భాగంగా ఎన్ఆర్ఐ రియాలిటీ మీట్ను నిర్వహించింది. ఈ కార్యక్రమం మస్కట్, దోహా, అబుదాబి, దుబాయ్లలో జరిగింది. గల్ఫ్ మార్కెట్లోకి ఏఎస్బీఎల్ యొక్క అధికారిక ప్రవేశాన్ని సూచించటంతో పాటుగా గ్లోబల్ ఇండియన్ కమ్యూనిటీలో అంతర్జాతీయ పెట్టుబడులను పెంచే దిశగా ఒక ముఖ్యమైన అడుగు పడింది. భారతీయ రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు మిడిల్ ఈస్ట్ అత్యంత ముఖ్యమైన ప్రాంతాలలో ఒకటిగా నిలుస్తోంది. ఈ ప్రాంతంలో ఏఎస్బీఎల్ యొక్క కార్యకలాపాలు ఎన్ఆర్ఐ పెట్టుబడిదారులతో సంబంధాలను పెంచుకోవడానికి, ప్రత్యక్ష అనుసంధానిత ద్వారా వారికి సేవ చేయాలనే దీర్ఘకాలిక లక్ష్యంతో శ్రీకారం చుట్టింది.
భారతదేశంలో పెట్టుబడి పెట్టేటప్పుడు మారుతున్న మార్కెట్ పరిస్థితిలు, రియల్-టైమ్ డేటాకు పరిమిత లభ్యత, దీర్ఘకాలిక విలువ చుట్టూ అనిశ్చితి వంటి ఎన్ఆర్ఐలు ఎదుర్కొనే కీలక సవాళ్లను పరిష్కరించడానికి మిడిల్ ఈస్ట్ ఎన్ఆర్ఐ రియాలిటీ మీట్ నిర్వహించారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తీరు, ధరల పరిస్థితి, మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధి, అద్దె రాబడి, హైదరాబాద్లో రాబోయే ప్రాజెక్టులు, దీర్ఘకాలిక పెట్టుబడి సామర్థ్యం గురించి స్పష్టమైన అవగాహన పొందేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
మిడిల్ ఈస్ట్ అన్ని నగరాల్లో జరిగిన ముఖాముఖి చర్చలకు ఏఎస్బీఎల్ వ్యవస్థాపకుడు , సీఈఓ అజితేష్ కొరుపోలు హాజరయ్యారు. భారతదేశంలో అత్యంత స్థిరమైన రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఒకటిగా హైదరాబాద్ ఎదుగుతున్న తీరును ఆయన వివరించారు.. ప్రీమియం రెసిడెన్షియల్ మైక్రో-మార్కెట్లలో ఎన్ఆర్ఐ పెట్టుబడులు స్థిరంగా పెరుగుతున్నాయని, దీనికి ఉపాధి వృద్ధి, మెరుగైన పట్టణ ప్రణాళిక, బలమైన నియంత్రణ చట్రాలు కారణమని ఆయన వెల్లడించారు. బలమైన మరియు అత్యంత ప్రభావవంతమైన ఎన్ఆర్ఐ పెట్టుబడిదారుల సంఘాలలో మిడిల్ ఈస్ట్ ఒకటన్న ఆయన తమ ఉద్దేశ్యం ప్రాజెక్టులను ప్రదర్శించడమే కాకుండా, ప్రపంచ భారతీయ కొనుగోలుదారులను పారదర్శకమైన, డేటా-ఆధారిత పరిజ్ఙానంతో శక్తివంతం చేయడమే లక్ష్యమని తెలిపారు.