07-06-2025 12:34:38 AM
కామారెడ్డి, జూన్ 6 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ పిఎస్ పరిధిలోని అంచనూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన 6 సీసీ కెమెరాలను ఏ ఎస్ పి చైతన్య రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో సిఐ సంపత్ కుమార్ , దోమకొండ ఎస్ఐ స్రవంతి పాల్గొన్నారు.
ఈ సీసీ కెమెరాల ను ఏర్పాటు చేయుటకు ముందుకు వచ్చిన మనోహర్ ని సన్మానించారు. గ్రామ యువత ఇలాంటి మంచి కార్యక్రమాలను ఏర్పాటులో ముందంజగా ఉంటూ పోలీసులకు సహకరిస్తూ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలంటూ , దొంగతనాలు జరుగకుండా ఉండాలంటే సీసీ కెమెరాల ను ఏర్పాటు చేసుకొవాలని ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తం గా ఉండాలంటూ అవగాహన కల్పించారు.