07-06-2025 12:35:31 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జూన్ 6: సమాజంలో బాల్యవివాహాలు,అక్రమ దత్తత మరియు బాల కార్మిక వ్యవస్థను అరికట్టాలని మండల వైద్యాధికారి డాక్టర్ భూక్య నగేష్ నాయక్ కోరారు.శుక్రవారం మండల కేంద్రం అర్వపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందితో కలిసి బాల్యవివాహాలు,అక్రమ దత్తత,భ్రూణ హత్యలపై పోస్టర్ను ఆవిష్కరిం చారు.
అనంతరం మాట్లాడుతూ చిన్న వయస్సులో బాల్య వివాహాలు చేసుకుంటే ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు.చిన్నారుల దత్తతను చట్టపరంగా తీసుకోవాలని,బాల కార్మికులను పనిలో పెట్టుకోవద్దని కోరారు.ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ బిచ్చు నాయక్,సూపర్వైజర్ లలిత, గౌతమి, దుర్గమ్మ, శోభారాణి, వర్షిత, వీరయ్య, మాధవి, శకుంతల, ఊర్మిళ, నాగరాణి తదితరులు పాల్గొన్నారు.