01-07-2025 12:00:52 AM
రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్
నాగర్కర్నూల్, జూన్ 30 (విజయక్రాంతి):మీడియా సంస్థలపై దాడి చేయడం దారుణమని, భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేసే చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా నిలుస్తాయని టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధు గౌడ్ అన్నారు. సో మవారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) డివిజన్ స్థా యి విస్తృత సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఓ మీడియా సంస్థ కార్యాలయంపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టుల హ క్కులు, సంక్షేమం కోసం టీయూడబ్ల్యూజే కట్టుబడి పనిచేస్తుందని చెప్పారు. ఈనెల 8న జిల్లా కేంద్రంలో జరిగే మహాసభను వి జయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సం దు యాదగిరి, జిల్లా కన్వీనర్ సుదర్శన్ రెడ్డి, కో-కన్వీనర్ ఎం. రాములు, కౌన్సిల్ సభ్యుడు కంచర్ల శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.