20-06-2025 05:22:09 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న బియ్యాన్ని ఈనెల 30న వేలం పాట నిర్వహిస్తున్నట్టు నిర్మల్ అర్బన్ తహసీల్దార్ రాజు(Tahsildar Raju) తెలిపారు. మొత్తం 139.254 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని వేలం పాట నిర్వహించడం జరుగుతుందని అర్హులైన వారు 5 ప్రభుత్వ డీడీలు చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని తహసీల్దార్ వివరించారు. డీడీలను ఈనెల 15 లోపు చెల్లించుకోవాలని సూచించారు.