20-06-2025 05:14:03 PM
మెదక్ పార్లమెంట్ కన్వీనర్ చింత సంతోష్ గుప్తా..
దౌల్తాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మెదక్ పార్లమెంట్ కన్వీనర్ చింత సంతోష్ గుప్తా(Medak Parliament Convener Chinta Santosh Gupta) అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎస్ వి గార్డెన్ లో బిజెపి మండల అధ్యక్షులు దేవుడి లావణ్య నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో బిజెపి ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మోదీ చేపడుతున్న సంక్షేమ పథకాలతో ప్రజల సుభిక్షంగా ఉన్నారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పార్టీ గుర్తింపునిస్తుందన్నారు. ఎంపీటీసీ, జడ్పిటిసి లను బిజెపి కైవసం చేసుకునే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిషన్, భూపాల్ రెడ్డి, నర్సింలు, సురేందర్ రెడ్డి, స్వామి, లక్ష్మణ్, గణేష్, స్వామి, మహేష్, రాజు గౌడ్, శ్రీనివాస్, శక్తి కేంద్ర ఇన్చార్జులు, బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.