బ్యాంకు లింకేజీలో ములుగు జిల్లాకు అవార్డు
08-05-2026 12:37 AM
ములుగు (మహబూబాబాద్) మే 7 (విజయక్రాంతి): బ్యాంకు లింకేజీ రుణాలు ఇ ప్పించడంలో ములుగు జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ విశేష కృషిచేసి 117 శాతం వృద్ధితో రాష్ట్రస్థాయి లో మూడో స్థానంలో నిలిచింది. గ్రామీణ మహిళల ఆర్థిక అభివృద్ధికి విశేషంగా కృషిచేసిన డిఆర్డిఓ పిడి చంద్రశేఖర్, ఏపీడి శ్రీనివాస్, డీపిఎం శ్రీనివాస్, గట్టమ్మ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పద్మ మంత్రి సీతక్క, సెర్ప్ సీఈవో దివ్య నుంచి అవార్డు అందుకున్నారు.






