17-06-2025 05:08:02 PM
మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల(Mancherial)లోని ఏసీసీ-3 అంగన్ వాడీ కేంద్రంలో మంగళవారం అతిసార వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం నాగలక్ష్మి మాట్లాడుతూ... వర్షాకాలం వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, పిల్లలు డయేరియా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అనంతరం పిల్లలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ టీచర్ ఎన్ పద్మ, సహాయకురాలు లత, తదితరులు పాల్గొన్నారు.