calender_icon.png 17 June, 2025 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీడీపీ అధ్యక్షుడిగా ఎల్లయ్య

17-06-2025 05:20:30 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) అధ్యక్షుడిగా ఏశబోయిన ఎల్లయ్య ఎన్నికయ్యారు. మంగళవారం కేసముద్రంలో నిర్వహించిన పార్టీ సంస్థ గత ఎన్నికల్లో ఎల్లయ్యను అధ్యక్షునిగా, యాసారపు నరసయ్య ఉపాధ్యక్షుడిగా, బోడకుంట్ల సత్యనారాయణ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అలాగే కార్యదర్శులుగా ఆవుల సారయ్య, జలాల్ షరీఫ్, కోశాధికారిగా గుర్రాల స్వరూప ఎన్నికయ్యారు. ఈ కమిటీ రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుందని ఎన్నికల పరిశీలకులు, రాష్ట్ర నాయకుడు యానాల అనంతరెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి పుల్లయ్య, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ కొండపల్లి రామచంద్రరావు మాట్లాడుతూ... రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రతి ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచ్ అభ్యర్థులను నిలుపుతుందని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని నూతన కార్యవర్గానికి సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఇమామ్, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎల్లయ్యకు ఎన్నిక ధ్రువపత్రాన్ని అందజేసి అభినందించారు.