ఓటు హక్కుపై అవగాహన

01-05-2024 01:26:03 AM

రాజేంద్రనగర్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి) : ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వి నియోగించుకోవాలని జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్‌చంద్ర అన్నారు. మంగళవారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపూర్ ఎంజీ పార్కులో రెసిడెన్షియల్ వెల్పేర్ అసోసియేషన్ వారికి ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఈసారి రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం పెంచేలా కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా ఓటు హక్కుపై ప్రతి జ్ఞ చేయించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ నరేష్, ఈఈ సంపత్, ఆర్‌డబ్ల్యూ ఏ ఏసీఎప్ జనరల్ సెక్రటరీ ఆంజనేయులు, సభ్యులు శ్రీనివాస్, దిలీప్ కక్కర్, వంశీ, కాంతారావు, జార్జ్ క్రిష్ట్ పాల్గొన్నారు.