10 April, 2026 | 8:26 PM

Breaking News

గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్   •   చిన్నారికి ఆర్థిక సాయం అందజేసిన పిఎసిఎస్ మాజీ చైర్మన్ జాలే నరసింహారెడ్డి   •   శివంగాలపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహణ   •   బనిగండ్లపాడులో మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన బండారు   •   నిమ్మపల్లిలో యువతి అదృశ్యం – పోలీసుల దర్యాప్తు ప్రారంభం   •   నూతన తహసిల్దార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు   •   విద్యుత్ శాఖ కాంపౌండ్ లో అగ్నిప్రమాదం   •   ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పక్కాగా అరైవ్ అలైవ్ కార్యక్రమాలు నిర్వహించాలి   •   తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు   •   జనగణన భూ స్వాధీన పనుల పరిశీలన   •  

వడదెబ్బకు వ్యక్తి మృతి

10-04-2026 06:42 PM

అనాధలైన ముగ్గురు పిల్లలు 

నవభారతలో విషాదఛాయలు

పాల్వంచ,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని నవ భారతి ఏరియా కు చెందిన భానోత్ బద్రు (57) శుక్రవారం వడదెబ్బకు గురై మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే బద్రు గత మూడు రోజులుగా కొత్తగూడెం రుద్రంపూర్ ప్రాంతాల్లో సిమెంట్ పనులు చేస్తూ తీవ్ర ఎండలకు వాంతులు, విరోచనాలకు గురై తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృత్యువాత పడ్డాడు. కుటుంబానికి పెద్దది ఎక్కువగా ఉన్న బద్రు మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు అనాధలయ్యారు. ఈ సంఘటనతో స్థానికంగా తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.