జల్ జీవన్ మిషన్పై అవగాహన కార్యక్రమం
శ్రీరంగాపురం ఏప్రిల్ 14: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జల జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జానంపేట గ్రామంలో అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పథకం ద్వారా గ్రామ ప్రజలకు శుద్ధమైన తాగునీటి ప్రాముఖ్యత, నీటి సంరక్షణ, సరైన వినియోగంపై వివరంగా అవగాహన కల్పించారు. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడం ప్రభుత్వ లక్ష్యమని గ్రామ సర్పంచ్ రాముడు తెలిపారు.
అనంతరం జానంపేట గ్రామంలో గ్రామ పంచాయతీ వర్కర్స్కు గౌరవార్థం సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కొత్త యూనిఫామ్లు, సబ్బులు, నూనె పంపిణీ చేశారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం సేవలు అందిస్తున్న వర్కర్స్కు గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాముడు, ఉప సర్పంచ్ నాగరాజు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






