23-06-2025 05:02:46 PM
కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహణ..
వెంకటాపురం నూగూరు (విజయక్రాంతి): రైతులకు సీజనల్ పంటలు, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇచ్చే రాయితీలపై సోమవారం అవగాహన సదస్సు కాఫేడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. సోమవారం కర్రవాని గుప్ప గ్రామంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఈఓ శ్యామ్(AEO Shyam) పాల్గొన్నారు. శ్యామ్ మాట్లాడుతూ... ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పథకం క్రింద పంట నష్టపోయిన రైతులకు ఆర్థికంగా సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పంటల భీమా పథకాన్ని ప్రారంభించిందన్నారు. ఈ స్కీమ్ కోసం విపత్తు, తెగుళ్ళు, కరువు కారణంగా పంటలు దెబ్బతిన్నపుడు భీమా పధకం క్రింద ఆర్థిక సహాయం అందచేస్తారు అని తెలియచేశారు. కిసాన్ క్రెడిట్ కార్డు గురుంచి తెలియ చేయటం జరిగింది. సీజనల్ గా పండించే పంటల గురించి వివరించటం జరిగింది. ఈ కార్యక్రమానికి వాజేడు మండల కోఆర్డినేటర్ కామేష్ వెంకటాపురం మండల కోఆర్డినేటర్ హనుమంతు యానిమేటర్స్ ఇందిరా, ఉషా, పద్మ, నరేష్, ప్రశాంత్ గ్రామస్థులు పాల్గొన్నారు.