14 July, 2026 | 2:11 PM

ఎంపీపీఎస్ అచ్చంపేటకు 30 డ్యూయల్ డెస్కుల పంపిణీ

14-07-2026 02:08 PM

నిజాంసాగర్ జూలై 14(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేటలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ సహకారంతో లిటిల్ రెడ్ జాంబీస్ సంస్థ 30 డ్యూయల్ డెస్కులను అందజేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. లాల్ సింగ్ తెలిపారు. అయన చేసిన అభ్యర్థన మేరకు ఈ డెస్కులను పాఠశాలకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు డి. లాల్ సింగ్ మాట్లాడుతూ, విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో చదువుకునేందుకు ఈ డ్యూయల్ డెస్కులు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల తరఫున రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ మరియు లిటిల్ రెడ్ జాంబీస్ సంస్థ ప్రతినిధులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సహాయం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటునందిస్తుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు వెంకట్రామిరెడ్డి తదితరులు ఉన్నారు.