21-06-2025 02:30:15 AM
పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ, ఎమ్మెల్యే మందుల సామేలు
నాగారం, జూన్ 20 : బాబు జగ్జీవన్ రావు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేర్లు వింటే కోట్లాదిమందికి ధైర్యం అని, వారు జాతి మహనీయులనీ తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్, పద్మశ్రీ ఎమ్మార్పీఎస్ ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం నాగారం మండల పరిధిలోని పసునూరు గ్రామంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కళామందిర్ అధ్యక్షులు, ఉత్సవాల కమిటీ ఫౌండర్ మరియు చైర్మన్ డాక్టర్ మల్లెపాక అనిల్ కుమార్ మాదిగ అధ్యక్షతన శుక్రవారం వారి విగ్రహాలను ఆవిష్కరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావ్ ,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వంటి మహనీయులను అందరూ ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధికి పాటుపడాల న్నారు. రాజ్యాంగాన్ని రచించి దేశానికి మార్గ నిర్దేశం చేసిన అంబేద్కర్ కల సహకారానికి అందరు కృషి చేయాలన్నారు. ఆ మహనీయుల ఆశయాల 35 ఏళ్ల పోరాట ఫలితమే ఎస్సి వర్గీకరణ అని అన్నారు.
మాదిగ జాతి అస్తిత్వం కోసం, వృద్ధులు వికలాంగులు పిల్లలు సబ్బండ వర్గాల అభివృద్ధికి అశేష కృషిచేసిన మందకృష్ణ మాదిగ కు పద్మశ్రీ రావడం యావత్ మాదిగ జాతికి గర్వకారణం అని ఎమ్మెల్యే సామేలు అన్నారు. ఈ దేశానికి సేవ చేసిన ప్రముఖుల్లో జ్యోతిరావు పూలే దంపతులు,బాబు జగ్జీవన్ రావ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. భారత రాజ్యాంగంలో జగ్జీవన్ రావు ప్రముఖమైన పాత్ర పోషించి సేవ చేశారని అన్నారు.
ఎమ్మార్పీఎస్ చేసిన ఉద్యమాలను మందకృష్ణ మాదిగ ప్రజల ముందు వివరంగా చెప్పి ఎమ్మార్పీఎస్ ప్రాముఖ్యతను వివరించారు.ఈ సందర్భంగా ప్రజాయుద్ధ ఒక ఏపూరి సోమన్న గిద్దె గళం రామనరసన్న ఆటపాటలతో ప్రజలను ఉర్రూతలుగించారు.
ఈ కార్యక్రమంలో బహుజన సంఘర్షణ సమితి అధ్యక్షులు గందమల్ల యాదగిరి, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, చిన్న శ్రీరాములు, చిప్పల పల్లి మల్లేష్, శ్రీరాముల అయోధ్య, పాల్వాయి బాలయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు వివిధ మండలాల ఇన్చార్జులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.