17 April, 2026 | 3:31 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

05-04-2025 07:21 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో శనివారం మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి కార్యక్రమాన్ని ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు రామగిరి మహేష్ ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రామగిరి మహేష్ మాట్లాడుతూ.. దళిత హక్కుల సాధనకై పోరాటం చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించిన జగ్జీవన్ రామ్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఎల్లయ్య, మచ్చ రాజేష్, శివ, రాచకొండ నరేష్, పుల్లూరి రాము, కాంపల్లి శంకర్, గుడిసెల రాజు, చిన్న రాజం రత్నం ఐలయ్య మిట్టపల్లి మల్లేష్, మంతెన కొమురయ్య, బొంకూరి రామచంద్ర, ఆయిళ్ల రామకృష్ణ, రాజేష్, అడ్డూరి వెంకన్న, శంకర్, రామగిరి వెంకటి, తంబి బుజ్జక్క తదితరులు పాల్గొన్నారు.