9 June, 2026 | 2:14 AM

కంచర్లలో బడిబాట

09-06-2026 01:29 AM

భిక్కనూర్, జూన్ 8(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామంలోని అప్పర్ ప్రైమరీ పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయు రాలు లత నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు గ్రామంలోని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో సమావేశమై ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను వివరించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలియజేస్తూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.