ఈదురు గాలులకు బీహార్ వాసి మృతి
09-06-2026 01:27 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా నర్సింగాపూర్లో ఘటన
బోయినపల్లి: జూన్ 8 (విజయక్రాంతి): సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నర్సింగాపూర్ ప్రధాన రహదారిలో ఆదివారం సాయంత్రం వచ్చిన ఈదురు గాలులతో బీహార్కు చెందిన ఎండీ శంషాద్ (28) అనే వ్యక్తి మృతి చెందాడు. బీహార్కు చెందిన శంషాద్ నర్సింగాపూర్ ప్రధా న రహదారిలో తాత్కాలికంగా పంచర్ షాపు నడుపుతున్నాడు.
ఆదివారం సాయంత్రం భారీ ఈదురు గాలులు వర్షం రావడంతో షాప్ కొట్టుకపోయింది. అందులో ఉన్న శంషాద్కు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందా డు. కుటుంబీకులకు సమాచారం అందించారు.






