31-05-2025 03:05:20 PM
కొత్తపల్లి: ప్రభుత్వం బడిబాట కార్యక్రమం జూన్ 6 వ తేదీ నుంచి 19 వ వరకు నిర్వహించబోయే షెడ్యూల్ ను జూన్ 9 నుంచి జూన్ 21 వరకు పొడిగించి మార్చాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఎంఏ ఖాద్రీ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈసందర్భంగా ఖాద్రీ మాట్లాడుతూ 7 వ తేదీన 'బక్రీద్' పండుగ, 8 వ తేదీన ఆదివారం ఉన్నందున ఇది వరకే ప్రభుత్వం ప్రకటించిన బడిబాట షెడ్యూల్ ను ప్రజల సంస్కృతి, సాంప్రదాయం, మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పునరాలోచించాలని అన్నారు.