31-05-2025 03:01:06 PM
కిన్నెరసాని గిరిజన బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో శ్రమదానం చేసిన మంత్రి పొంగులేటి, ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
మొక్క నాటిన మీనాక్షి నటరాజన్
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని గిరిజన బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Revenue Minister Ponguleti Srinivasa Reddy), ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి(MP Ramasahayam Raghuram Reddy) శనివారం ఉదయం శ్రమదానం చేశారు. ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి స్వయంగా పిచ్చి మొక్కలను తొలగించి, చెత్తను ఎత్తివేసి శుభ్రం చేశారు. ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్(AICC Telangana State Affairs In-charge Meenakshi Natarajan) ఈ ప్రాంగణంలో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో మహబూబా బాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచందర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.