బడిబాటను విజయవంతం చేయాలి
సంగారెడ్డి కలెక్టర్ వల్లూరి క్రాంతి
జహీరాబాద్, మే 29 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి చేపట్టనున్న బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. జహీరాబాద్ డివిజన్లోని హగ్గెలి, పస్తాపూర్ పాఠశాలలను బుధవారం ఆమె సందర్శించారు. పాఠశాలల ప్రారం భం నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ రాజు, తహసీల్దార్ రవీందర్, పీఆర్ ఈఈ కోటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
భూసేకరణ వేగవంతం చేయాలి..
జహీరాబాద్ డివిజన్ పరిధిలోని న్యాల్కల్, ఝరా సంఘం మండలాల్లో చేపట్టిన నిమ్జ్ భూమి సేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ క్రాంతి అన్నారు. జహీరాబాద్ లోని నిమ్జ్ కార్యాలయంలో భూ సేకరణకు సంబంధించి అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు.






