27-06-2025 12:00:00 AM
రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో ని ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలను ప్రభుత్వం నిషేధిస్తున్నట్లు ఆర్థిక శాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. బదిలీల్లో కొన్ని సడలింపులు ఇస్తూ, కొన్ని ప్రత్యేక అంశాల్లో ఈ నిషేధం వర్తించదంటూ పేర్కొన్నది.
కొన్ని జిల్లాల్లో క్లియర్ వేకెన్సీలు ఉన్న పోస్టుల్లో అనధికారికంగా బదిలీలు జరుగుతున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలోనే ప్రకటన జారీ అయినట్టు సమాచారం. త్వరలోనే లోకల్ బాడీ ఎన్నికలు జరుగనుండటం కూడా మరో కారణమని తెలుస్తున్నది. ఎవరికైనా పదోన్నతి కల్పిస్తే తర్వాత ఖాళీ అయిన పోస్టును భర్తీ చేసేందుకు మాత్రం బదిలీ చేయొచ్చని ఉత్తర్వుల్లో ఉంది.