calender_icon.png 27 June, 2025 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం

26-06-2025 11:43:02 PM

స్టాండింగ్ కమిటీలో 22 అంశాలు, 10 టేబుల్ ఐటమ్ లకు ఆమోదం..

హైదరాబాద్ సిటీ బ్యూరో (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం(GHMC Standing Committee Meeting) గురువారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Mayor Gadwal Vijayalakshmi) అధ్యక్షతన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 22 ఎజెండా అంశాలకు, 10 టేబుల్ ఐటమ్స్‌కు కమిటీ సభ్యులు ఆమోదం తెలిపినట్లు మేయర్ వెల్లడించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎంసీ ట్యాంక్ బండ్ ప్రాంగణం యొక్క లీజు వ్యవధిని మరో మూడు సంవత్సరాలు పొడిగించడానికి ఆమోదం లభించింది. ఈఈఎస్‌ఎల్ తో ఒప్పందం గడువు ముగిసిన నేపథ్యంలో ఇప్పటికే ఉన్న డీఐసీ విక్రేతలతో రెండు నెలల పాటు లేదా కొత్త ఏజెన్సీ ఖరారయ్యే వరకు వీధి లైట్ల నిర్వహణ కొనసాగించడానికి నిర్ణయించారు.

కొత్త ఏజెన్సీ ఎంపిక కోసం టెండర్లు పిలవడం లేదా ఈఈఎస్‌ఎల్ తోనే కొత్త ఒప్పందం కుదుర్చుకోవడంపై తదుపరి నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. సోమాజిగూడ సర్కిల్ సమీపంలోని ఫ్లైఓవర్ కింద 2800 చదరపు మీటర్ల స్థలంలో సుందరీకరణ, నిర్వహణను ముడు సంవత్సరాల పాటు సీఎస్‌ఆర్ కింద మెస్సర్స్ మలబార్ రాయల్ డిజైన్స్ హైదరాబాద్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించడానికి ఆమోదం లభించింది. ఆమోదించిన అంశాల్లో విద్యుత్ కి సంబంధించి ఏజేన్సీలకు అప్పగించే విషయంతో పాటు పలుచోట్ల రోడ్ల నిర్మాణం తదితర అంశాలు ఉన్నాయి. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు బొంతు శ్రీదేవి, బానోతు సుజాత, సమీనా బేగం, అబ్దుల్ వాహెబ్, పర్వీన్ సుల్తానా, అడిషనల్, జోనల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.