27-06-2025 12:00:00 AM
సీఎస్ను కోరిన టీజీవో సంఘం నేతలు
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): ఉద్యోగుల సాధారణ బదిలీలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ను టీజీవో నేతలు కోరారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, అసోసియేట్ అధ్యక్షుడు బీ శ్యామ్తోపాటు పలువురు నేతలు గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ను కలి సి వినతిపత్రం సమర్పించారు.
పెండింగ్ బకాయిలు, డీఏలతోపాటు ఇతర ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లి సుధీర్ఘంగా చర్చించినట్టు టీజీవో నేతలు తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లను పరి ష్కరిం చాలని విజ్ఞప్తి చెయడంతో సీఎస్ సానుకూలంగా స్పందించినట్టు పేర్కొన్నారు.