21-06-2025 07:19:31 PM
జులై 15న దేవరకొండ లో సిపిఐ జిల్లా మహాసభ..
సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట రెడ్డి..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేకూర్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్మిస్తున్న బనక చర్ల ప్రాజెక్టును నిలిపివేయాలని సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట రెడ్డి(CPI National Committee member Palla Venkata Reddy) డిమాండ్ చేశారు. సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట రెడ్డి డిమాండ్ చేశారు. సిపిఐ నల్గొండ జిల్లా కార్యవర్గ సమావేశం శనివారం స్థానిక మగ్దుమ్ భవన్ శనివారం జరిగింది. సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ... వరద జలాలపై తెలంగాణ రాష్ట్రంకు ఉన్న అక్కువాటాన్ని తేల్చకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా ప్రాజెక్టును ఏలా నిర్మిస్తుం దని ప్రశ్నించారు.
కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వం అండదండలు ఉండటంతో ఈ ప్రాజెక్టుకు అనుమతులతో పాటు ఆర్థిక సహకారం అందించే విధంగా చంద్రబాబు పావులు కలుపుతూ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. జల వివాదాలు ఉభయ తెలుగు రాష్ట్రాలకు మంచిది కాదని హితవు పలికారు. మరోవైపు రూ. 85వేల కోట్ల భారీ వ్యయంతో తలపెట్టిన బనకచర్ల ప్రాజె క్టును ఎపిలోని రైతు సంఘాలు, ప్రజలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాలు కూర్చుని సుమారు సముద్రంలో కలిసే 3000 టీఎంసీల జలాలు ఎవరి వాటా ఎంతో తేల్చుకున్న తర్వాతే కట్టు కోవచ్చు అన్నారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ... నల్లగొండ జిల్లాలో సిపిఐ గ్రామ, మండల మహాసభలు విజయవంతంగా పూర్తి చేసుకొని జూలై 15వ తేదీన దేవరకొండ పట్టణంలో నల్లగొండ జిల్లా మహాసభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈమహాసభలో జిల్లా సమగ్ర అభివృద్ధి, సంస్థగతంగా పార్టీని బలోపేతం చేసుకోవడం తోపాటు ప్రజా ఉద్యమాలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుందని తెలిపారు.
యాసంగి వరి పంట పండించిన రైతులకు ప్రభుత్వం ఇస్తామన రూ. 500బోనస్ ను వెంటనే రైతులకు ఇవ్వాలని కోరారు. అదేవిదంగా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థులు అధిక స్థానాలు గెలుపొందేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు ఉజ్జిని రత్నాకర్ రావు, జిల్లా సహాయ కార్యదర్శిలు పల్లా దేవేందర్ రెడ్డి,లోడింగి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, ఆర్. అంజచారి,బంటు వెంకటేశ్వర్లు, బొల్గురి నరసింహ, గురుజ రామచంద్రం, నల్పరాజు రామలింగయ్య, టి వెంకటేశ్వర్లు బొడ్డుపల్లి వెంకట్ రమణ,ఉజ్జిని యాదగిరిరావు తదితరులు పాల్గొన్నారు.