21-06-2025 07:21:19 PM
కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International Yoga Day) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన యోగా ట్రైనర్ ఎస్ నగేష్, యోగ పైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ కె విజయ్ కుమార్ మాట్లాడుతూ, యోగ ద్వారా ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత ఏర్పడుతుందన్నారు. అంతేగాక ఆరోగ్యకరమైన జీవన శైలిని ఏర్పరచుకోవచ్చని, ప్రతి ఒక్కరు ప్రతిరోజు యోగను దినచర్యంలో భాగంగా అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె కిష్టయ్య ,అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ విశ్వప్రసాద్, ఎన్ సిసి అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ ఏ సుధాకర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ పి రాజ గంభీర్ రావు, డాక్టర్ జి చంద్రశేఖర్ గౌడ్, కళాశాల అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది , ఎన్ సిసి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థిని ,విద్యార్థులు పాల్గొన్నారు.