calender_icon.png 24 June, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కనీస అవగాహన లేకుండా బండి సంజయ్ వ్యాఖ్యలు

24-06-2025 01:17:17 AM

కరీంనగర్ క్రైం, జూన్23(విజయక్రాంతి): తెలంగాణ ప్రజల కలల బహుళ ప్రయోజనాల భా రీ లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టుపై కనీస అవగాహన లేకుండా బండి నంజయ్ వ్యాఖ్యలు చే యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు జి వి రామకృష్ణ రావు పేర్కొన్నారు.సోమవారం కరీంనగర్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గోదావరి నీళ్లను సముద్రంలో కలవనీయకుండా అడ్డుకునేందుకు గతంలో ఏ ప్రభుత్వమూ కృషి చేయలేదన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులకు బిందెలు అడ్డుకునే పరిస్థితి నుంచి కాళేశ్వరం ప్రా జెక్టు నిర్మాణంతో ఎండాకాలంలో చెరువులు నిండి భూగర్జజలాలు పెరిగి పంటల సాగుకు మించి కరువు నేలలను సస్యశ్యామలం చేసిందని గుర్తు చేశారు. కనీస విషయ పరిజ్ఞానం లే కుండా కేవలం కెసిఆర్ పై విమర్శలు, దూషణలు, ఆరోపణలే పనిగా పెట్టుకుని వబ్బం గడువుకుంటున్న కేంద్ర మంత్రి బండి వైఖరిపై ప్రజలు చీత్కరించుకుంటున్నారన్నారు.

కెసిఆర్ అరెస్టును డిమాండ్ చేస్తున్న బండి సంజయ్ అసలు తప్పే జరగనప్పుడు విచారణలు,అరెస్టులు ఎలా చేస్తారని హోంశాఖ సహాయ మంత్రిగా తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్,కాళేశ్వరం ప్రాజెక్టు ఎంక్వైరీ, కమిషన్లపై నమ్మకం లేదంటున్న బండి సంజయ్ కాళేశ్వరం కమిషన్ కు నివేదిక ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అదే విధంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో దమ్ముంటే సి ట్ కు హాజరు కావొద్దని నవాల్ చేశారు.

కేంద్రంలో సిబిఐ ఎంక్వైరీల విషయంలో బిజెపి ప్రముఖ నేతల విషయంలో ఎందుకు విచారణలు, అరెస్టులు ఆపారో సమాధానం చెప్పాలన్నారు. వారిని జైలులో వేయకుండా బ్లాక్మెయిల్ తో బిజెపిలోకి తెచ్చుకున్నారని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖలో 18 ఏజెన్సీలతో పాటు అనేక విభాగాలున్నాయని,

ఆయన తోటి కేంద్ర హోంశాఖ సహా యమంత్రి బీహార్ కు చెందిన నిత్యానంద్ రాయ్ సెంట్రల్ ఆరమ్డ్ ఫోర్స్ ఎక్కడ ఉంటే అక్కడ భరోసా కల్పిస్తూ తన బాధ్యతలు నిర్వహిస్తున్నాడన్నారు. సమావేశంలో బిఆర్‌ఎస్‌నగర అధ్యక్షుడు చల్ల హరి శంకర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, శ్రీనివాస్, మోహన్, చాంద్‌తదితరులున్నారు.