24-06-2025 01:15:46 AM
పీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శీనుబాబు
మహదేవపూర్(భూపాలపల్లి), జూన్ 23 (విజయక్రాంతి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా మంతిని ప్రజల ఆశీర్వాదం తోనే పదవి రావడం జరిగిందని శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిల్ల శ్రీను బాబు అన్నారు. ఇటీవల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శీను బాబు మహాదేవపూర్ మండలంలో సోమవారం పర్యటించారు.
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ సీనియర్ యువజన నాయకుల ఆధ్వర్యంలో శీను బాబును గజమాల, రామబాణం తో సత్కరించారు. మండల కేంద్రంలోని తన తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తన తండ్రి ఆశ సాధనకు కృషి చేస్తూ మంథిని ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు.
మంతిని ప్రజల కొరకు ఎల్లవేళల అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు ఈ.ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్బర్ ఖాన్, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ చల్ల తిరుపతయ్య,
మాజీ ఎంపీపీ రాణి బాయి, మాజీ జెడ్పిటిసి గుడాల అరుణ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బందెల సత్తెమ్మ, యువజన నాయకులు కటకం అశోక్, విలాస్ రావు, కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ కుంభం పద్మ, మాజీ కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ వామన్ రావు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు అస్రార్ కురేసి, నైముద్దీన్, చెన్నూరి వెంకటయ్య, పలిమేల మహాదేవపూర్ మండలాల మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.