15 March, 2026 | 9:22 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

చెరువుల పునరుద్ధరణలో బెంగళూరు భేష్

08-11-2024 12:00 AM
  1. అక్కడి విధానాలను హైదరాబాద్‌లో అమలు చేస్తాం  
  2. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 7 (విజయక్రాంతి): చెరువుల పునరుద్ధరణ, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణలో బెంగళూరు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను ప్రభుత్వంతో చర్చించి హైదరాబాద్ నగరంలోనూ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. బెంగళూరులో చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణపై అధ్యయనం చేసేందుకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో రీజినల్ ఫైర్ ఆఫీసర్లు వీ పాపయ్య, ఏ జయప్రకాశ్, ఏఈ నాగరాజు, ఇన్‌స్పెక్టర్ విజయ్ ఆదిత్య తదితరులు మూడ్రోజుల బెంగళూరు పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.

పర్యటనలో భాగంగా తొలిరోజు గురువారం కర్నాటక నేచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్‌ను హైడ్రా అధికారులు సందర్శించారు. ఈ కేంద్రంలో వర్షపాతం నమోదు, గాలి వేగం, ఉష్ణోగ్రతల వివరాలు వెల్లడించే వాతావరణ కేంద్రాన్ని పరిశీలించారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు వినియోగించే మేఘ సందేశం యాప్ పనితీరును పరిశీలించారు. స్థానిక యలహంక, జక్కూ ర్ చెరువులను పునరుద్ధరించిన తీరును అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువుల్లోకి వచ్చే మురుగును ఎస్‌టీపీల ద్వారా శుద్ధి చేసే విధానం, ఆ తర్వాత చెరువుల పునరుద్ధరణకు అనుసరిస్తున్న విధానాలను బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) అధికారులను అడిగి తెలుసుకున్నారు.