2 July, 2026 | 12:28 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషల్ డిపాజిట్ స్కీమ్

28-09-2024 12:00 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు పండుగ బహుమతిగా రూ.3 కోట్ల లోపు మొత్తానికి ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో ఒక ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 400 రోజులు కాల పరిమితిగల ఈ రిటైల్ టెర్మ్ డిపాజిట్‌పై (రూ.1 కోటిపైబడిన నాన్ డిపాజిట్) సూపర్ సీనియర్ సిటిజన్లకు  8.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.95 శాతం, ఇతర ఖాతాదారులకు 7.45 శాతం వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తున్నట్టు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన తెలిపింది.

ముందస్తు విత్‌డ్రాయిల్ ఆప్షన్‌తో కాలబుల్ డిపాజిట్‌పై  సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.95 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం, ఇతర ఖాతాదారులకు 7.30 శాతం వార్షిక వడ్డీని అందిస్తున్నట్లు బ్యాంక్ పేర్కొం ది.

ఈ 400 రోజుల ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ దేశీయ పౌరులతో పాటు ఎన్‌ఆర్‌ఈ, ఎన్‌ఆర్‌వో డిపాజిటర్లకూ అందుబాటులో ఉంటు ంది. 2024 సెప్టెంబర్ 27 నుంచి తమ బ్యాంక్ అన్ని శాఖల్లోనూ,  డిజిటల్ చానళ్లలో (బీవోఐ ఓమ్ని నియో యాప్/ఇంటర్నెట్ బ్యాంకింగ్) ఈ డిపాజిట్ చేయవచ్చని బ్యాంక్ ఆఫ్ ఇండియా            వివరించింది.