calender_icon.png 28 July, 2025 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ ఆర్థికానికి బ్యాంకుల సహకారం

28-07-2025 01:38:15 AM

బ్యాంకుల నిర్వచనం మారుతోంది: మంత్రి శ్రీధర్‌బాబు

టెక్నాలజీని మిళితం చేస్తూ మార్పునకు అనుగుణంగా సేవలు

హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): ఒకప్పుడు బ్యాంకులంటే కేవలం డబ్బులు డిపాజిట్, విత్‌డ్రా మాత్రమే అనుకునేవారు, కానీ ఇప్పుడు బ్యాంకుల నిర్వచనమే మారిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఖాతాదారుల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా టెక్నాలజీని మిళి తం చేస్తూ మార్పులను అందిపుచ్చుకుంటూ వివిధ రకాల సేవలను అందిస్తున్నాయని చెప్పారు.

అగ్రసేన్ బ్యాంక్ అమీర్‌పేట బ్రాంచ్‌ను ఆదివారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.. దేశ ఆర్థిక వ్య వస్థలో సహకార బ్యాంకుల పాత్ర కీలకమని, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు ఆర్థిక సేవలను అందించడంలో ఇవి ముందున్నా యని చెప్పారు. ఆర్‌బీఐ వార్షిక నివేదిక 2024 ప్రకారం దేశవ్యాప్తంగా 8.5 కోట్ల మందికి పైగా ప్రజలు వీటి సేవలను వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు.

మొ త్తం డిపాజిట్లు, రుణాలు రూ.5.5 లక్షల కో ట్ల మార్క్‌ను దాటాయని వివరించారు. తెలంగాణలో 48 అర్బన్ కో బ్యాంకులు 321 శాఖల ద్వారా అర్బన్, సెమీబీ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్స రంలో వీటి బిజినెస్ టర్నోవర్ రూ.17వేల కోట్లు, క్రెడిట్ కాగా డిపాజిట్ నిష్పత్తి 66.7 శాతమని చెప్పారు. కూకట్‌పల్లి, మలక్‌పేట్, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో క్రియాశీలకంగా ఉన్నాయని స్పష్టం చేశారు. 

తెలంగాణ మోడల్ ‘పాథ్’..

సహకార బ్యాంకులు లాభాపేక్షతో కాకుం డా, ఖాతాదారుల ప్రయోజనాల కోసం కమ్యూనిటీ ఆధారిత సేవలను అందిస్తున్నాయని తెలిపారు. కేర్(కమ్యూనిటీ ఫోకస్డ్, అఫర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ క్రెడిట్, రిలేషన్‌షిప్ బేస్డ్ బ్యాంకింగ్, ఎంపరింగ్ లోకల్ ఎంటర్‌ప్రెన్యూర్స్) మోడల్‌లో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకార రంగ బ్యాంకుల అభివృద్ధికి పాథ్(పాలసీ సపోర్ట్, యాక్సెస్ టూ డిజిటల్ టూల్స్, ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, హైబ్రిడ్ ఫైనాన్స్ ఎకో సిస్టమ్స్)మోడల్‌ను అనుసరిస్తుందని వివరించారు.

యువత, వెనుకబడిన వర్గాలకు స్వయం ఉపాధి రుణాలు, మహిళా స్వయం సహాయక బృందాలకు రుణ అనుసంధానాలు, గ్రీన్‌లోన్స్ వంటి పథకాలను ప్రోత్సహిస్తు న్నామని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ అగర్వాల్ సమాజ్ ప్రెసిడెంట్ అనిరుధ్ గుప్తా, టిబారుమల్ జ్యూవెల్స్ ప్రై.లి. రాంభరోసే గుప్తా, సోమాని ఇస్పాత్ ప్రై.లి. ఎండీ అశోక్‌కుమార్ సోమాని, అగ్రసేన్ బ్యాంక్ చైర్మన్ ప్రమోద్‌కుమార్ ఖేడియా, సీనియర్ వైస్ చైర్మన్ నవీన్‌కుమార్ అగర్వాల్, వైస్ చైర్మన్ సురేశ్‌కుమార్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.