పది ఫలితాలలో భూపతిపూర్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యార్థినుల విజయకేతనం
29-04-2026 07:41 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): 10వ తరగతి పరీక్షా ఫలితాలలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం విద్యార్థినులు విజయకేతనం ఎగురవేశారు. కేజీబీవీ భూపతిపూర్ లో 10వ తరగతి చదివిన 42 మందికి విద్యార్థినులకు గాను 42 మంది ఉత్తీర్ణత సాధించారు. ఎం, దివ్యశ్రీ 556/600 ప్రథమస్థానం కే, తులసి రాణి 554/600 ద్వితీయ స్థానమును, పదిమంది విద్యార్థులు 500 పైన మార్కులు సాధించారని, ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ ఎం, స్వప్న విద్యార్థునులను, ఉపాధ్యాయనీ బృందంను అభినందించారు.






