24 June, 2026 | 3:08 PM

Breaking News

నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్‌కు నూతన మండల అధ్యక్షుల నియామకం   •   పాఠశాలకు వచ్చిన జాతీయ పక్షి.. నెమలిని చూసి మురిసిపోయిన చిన్నారులు   •   విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ   •   పారిశుద్ధ్య పనులు ముమ్మరం   •   గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేయాలి   •   జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి తహశీల్దారుకు వినతి   •   యువతను ప్రమాదంలోకి నెట్టే మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   యువత, చిన్నారులు డ్రగ్స్ పట్ల దూరంగా ఉండాలి: సీఐ సంజీవ్   •   చీర్లవంచలో అరుణోదయ మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమి పూజ   •  

ఖానాపూర్ మున్సిపాలిటీ అత్యంత సుందరంగా తీర్చిదిద్దుదాం

29-04-2026 07:38 PM

ఖానాపూర్ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు వెడమ బొజ్జు పటేల్

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపాలిటీ అత్యంత సుందరంగా తీర్చిదిద్దుదామని ఖానాపూర్ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు వెడమ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం ఖానాపూర్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం మొదటి సాధారణ సమావేశం జరిగింది. మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఈ మేరకు ఖానాపూర్ పట్టణ అభివృద్ధి కోసం పలు తీర్మానాలు చేసినట్లు మున్సిపల్ చైర్మన్ మౌనిక తెలిపారు. పట్టణంలోని పలు వార్డులలో ప్రజల దాహార్తి తీర్చడానికి బోరు మోటార్లు ఏర్పాటు, మరమ్మతులు, దాంతో పాటు పట్టణంలో వేలాదిగా పెరిగిపోయిన కోతుల బెడద తీర్చేందుకు వాటిని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టి వేరే చోటికి తరలించడానికి తీర్మానం చేసినట్లు ,దాంతోపాటు పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణ వంటి అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు.