29 April, 2026 | 8:56 PM

పదవ తరగతి ఫలితాలలో ఎస్వీ విద్యార్థుల ప్రభంజనం

29-04-2026 07:43 PM

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): ఈ రోజు ప్రకటించిన పదో తరగతి పరీక్ష ఫలితాలలో మండల కేంద్రంలో ఉన్న ఎస్ వి అకాడమీ స్కూల్ విద్యార్థులు100% ఉత్తీర్ణత సాధించారు.  ఫలితాలలో 566 మార్కులతో రమ్యశ్రీ స్కూల్ టాపర్ గా నిలిచారు. ద్వితీయ స్థానంలో లహరి 548 మార్కులు సాధించారు. హాజరైన విద్యార్థులలో 20 మంది గాను 20 మంది ఉత్తీర్ణత సాధించారు .ఇంతటి ఘనమైన ఫలితాలు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్  చైర్మన్  మిరియాల శ్యాం ప్రసాద్ ప్రిన్సిపాల్, ట్రెజరరీ సతీష్ కుమార్,ఉపాధ్యాయులు విద్యార్థులను అందించారు.