calender_icon.png 23 June, 2025 | 12:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరెంట్ షాక్‌తో బర్రె మృతి

18-06-2025 12:43:57 AM

చేవెళ్ల, జూన్ 17 : కరెంట్ షాక్ తో పాడి బర్రె మృతి చెందింది.  బాధితులు, గ్రామస్తుల వివరాల ప్రకారం..  చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామానికి చెందిన జూకంటి చిన్న బుచ్చయ్యకు మూడు బర్లు ఉన్నాయి.  రోజూ మాదిరిగానే మంగళవారం  వాటిని మేపేందుకు తీసుకెళ్లాడు.  అయితే, సోమవారం రాత్రి గాలి దుమారానికి ఓ రైతు పొలంలో విద్యుత్ తీగ తెగి పడింది.

ఇది గమనించని ఆయన బర్రెలను అటు వైపు తీసుకెళ్లగా, ఓ బర్రెకు వైర్ తగిలి అక్కడికక్కడే  మృత్యువాత పడింది.  బాధితుడు వెంటనే విద్యుత్ లైన్ మన్ అనిల్‌కు సమాచారం ఇవ్వగా.. ఆయన ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. 

విద్యుత్ అధికారులతో పాటు వెటర్నరీ డాక్టర్, పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. రెండు నెలల కిందనే అనారోగ్యంతో రెండు బర్లు చనిపోయి రూ. 1.60 లక్షల వరకు నష్టపోయానని,  ఇప్పుడు మ రో రూ.80 వేలు నష్టం జరిగిందని ప్రభుత్వమే ఆదుకోవాలని   బుచ్చయ్య కోరాడు.