18-06-2025 12:41:47 AM
యాచారం, జూన్ 17 : ఫార్మా రైతులకు రైతు భరోసా కల్పించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం యాచారం మండలంలోని తాడిపత్రి గ్రామంలో ఏర్పా టు చేసిన రైతు రెవెన్యూ సదస్సు లో తహసిల్దార్ అయ్యప్ప కు రైతులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రైతులు మా ట్లాడుతూ. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఫార్మాసిటీ నోటిఫికేషన్ కాంగ్రెస్ ప్రభుత్వ రద్దు చేసినట్లుగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది.
ఫార్మా భూముల రైతులకు అన్ని హక్కులు కల్పించవలసిందిగా హైకోర్టు తీర్పునివ్వగా ఫార్మాసిటీలో ఉన్న భూములకు ప్రభుత్వం ఎటువంటి పరిహారం చెల్లిం చలేదని రైతుల వద్ద బలవంతపు భూసేకర ణ చేయదని తీర్పు వచ్చింది. గత ప్రభుత్వం రైతులకు రైతుబంధు ఇవ్వడం జరిగింది. కావున తక్షణమే రైతులందరికీ రైతు భరోసా కల్పించవలసిందిగా అధికారులను కోరారు.