18-06-2025 12:45:30 AM
ఎల్బీనగర్, జూన్ 17 : పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరా నిలుస్తుందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. చంపాపేట డివిజన్ పరిధిలోని దుర్గాభవానీ నగర్ కు చెందిన విజయ గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నది.
అయితే, విజయ కుటుంబ ఆర్థికస్థితి బాగా లేకపోవడంతో కుటుంబసభ్యులు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డిని సంప్రదించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ... ముఖ్యమంత్రి సహాయనిధిలో రూ, 2 లక్షల ఎల్వోసీ చెక్కు మంజూరు చేయించారు. ఈ మేరకు మంగళవారం బాధితురాలి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ చెక్కు అందజేశారు.