మెలైరా, ఇన్వెరిస్ గోల్డ్ ఆవిష్కరించిన బీఏఎస్ఎఫ్
ముంబై :
భారతీయ రైతులు పంట ఉత్పాదకతను మెరుగుపరుస్తూ, పురుగులు మరియు తెగుళ్ళను మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయపడటానికి రూపొందించిన రెండు కొత్త పంట రక్షణ పరిష్కారాలైన మెలైరా శిలీంద్రనాశకం మరియు ఇన్వెరిస్ గోల్డ్ కీటకనాశకాన్ని బీఏఎస్ఎఫ్ అగ్రికల్చరల్ సొల్యూషన్స్ విడుదల చేసింది. మెలైరా అనేది రెవిసోల్ యాక్టివ్, బీఏఎస్ఎఫ్ యొక్క నూతన ఐసోప్రొపనాల్‑అజోల్ అణువుతో పనిచేసే ఒక తదుపరి తరం, బ్రాడ్-స్పెక్ట్రమ్ శిలీంధ్రనాశకం.
ఇది సమర్థవంతమైన వ్యాధి నియంత్రణ మరియు నిరోధకత నిర్వహణకు తోడ్పడుతుంది. పైరాక్లోస్ట్రోబిన్తో కలిపి రూపొందించబడిన ఇది, మొక్కల జీవశక్తిని మరియు పంట పనితీరును మెరుగుపరిచే అగ్సెలెన్స్ ప్రయోజనాలను అందిస్తుంది. మెలైరా పత్తి, వేరుశనగ, సోయాబీన్, మిరప మరియు టమాటా వంటి పంటలకు అనుకూలంగా ఉంటుంది.
ఇన్వెరిస్ గోల్డ్, పేను బంక, పచ్చ దోమ తెల్లదోమలు, తామర పురుగులు, నల్లి మరియు ఆకు తొలిచే పురుగులతో సహా, కుట్టే మరియు రసం పీల్చే పురుగులపై విస్తృత శ్రేణిని నియంత్రణను అందించడానికి ద్వంద్వ క్రియాశీలకాలతో రూపొందించబడింది. ఇది మిరప, టమాటా, వంకాయ, దోసకాయ మరియు బెండకాయ వంటి కూరగాయల పంటలకు అనుకూలంగా ఉంటుంది. బీఏఎస్ఎఫ్ మెలైరా మరియు ఇన్వెరిస్ గోల్డ్తో, తాము స్థానిక వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన పరిష్కారాలతో భారతదేశంలో మా పంట రక్షణ పోర్ట్ఫోలియోను విస్తరిస్తున్నామని బీఏఎస్ఎఫ్ అగ్రికల్చరల్ సొల్యూషన్స్ ఇండియా డైరెక్టర్ గిరిధర్ రానువా చెప్పారు.






