03-11-2025 07:26:55 PM
బీసీ రిజర్వేషన్ సాధన సమితి జిల్లా నాయకులు కట్ట జగన్నాథం
చండూరు,(విజయక్రాంతి): బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి నాయకులు కట్ట జగన్నాథం అన్నారు. సోమవారం చండూరు మండల కేంద్రంలోని బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో చండూరు మండల తహసిల్దార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోని పిల్ నెంబర్ 3, 4 ద్వారా మార్చి 2025లో విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ ను 42 శాతానికి పెంచుతూ ఆమోదించిందని, ఈ బిల్లు గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత కేంద్రానికి పంపబడి గత ఏడు నెలలుగా కేంద్రం వద్ద తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడానికి పెండింగ్లో ఉన్నాయని ఆయన అన్నారు.
రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. 42% రిజర్వేషన్ లో ఉపవారికరణ సబ్ క్యాటగిరేషన్ చేయాలని, అత్యంత వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం జరిగేలా చూడాలని,కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటుచేసి ప్రతి సంవత్సరం 20 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించిమొదటి సంవత్సరంలో కేటాయించిన 9200 కోట్లలో కేవలం 2068 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆయన అన్నారు.
ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం బీసీల విద్య ఉపాధి ఆర్థిక అభివృద్ధి కోసం మొత్తం 40 వేల కోట్లు తక్షణమే అనగా ఈ ఆర్థిక సంవత్సరంలోగా ఖర్చు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చేసిన అన్ని హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, రాష్ట్రంలో అన్ని నామినేటెడ్ పోస్టులు, కమిషన్లు బోర్డులు, సలహా మండల్లో 90 శాతం ప్రాతినిథ్యం బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.