09-06-2025 02:36:15 AM
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): భారత్ డైనమిక్ లిమిటెడ్(బీడీఎల్) కేవలం దేశ భద్రతను బలోపేతం చేయడమే కాకుం డా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని దాదాపు 3,200 ఎంఎస్ఎంఈలకు ఊతమిచ్చి, స్వదే శీ సామర్థ్యాన్ని, సృజనాత్మకతను కూడా పెంపొందించిందని ప్రముఖ వ్యూహాత్మక ఆలోచనల నిపుణుడు, రిటైర్డ్ కమడోర్ మాధవరావు తెలిపారు.
ఆత్మనిర్భర భారత్ స్ఫూర్తిని కూడా బీడీఎల్ ప్రదర్శిస్తుందన్నా రు. మేనేజ్మెంట్, సృజనాత్మకత, డిఫెన్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్ వంటి రంగాల్లో అపారమైన సేవలు అందించిన పలువురు వ్యక్తు లు, సంస్థలను హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్(హెచ్ఎంఏ) వార్షిక అవార్డు ల ప్రదాన కార్యక్రమంలో సత్కరించింది.
రిటైర్డ్ వింగ్ కమాండర్ ఆవుల భరత్భూషణ్కు జీవన సాఫల్య అవార్డును, స్వస్థవ క్యాన్సర్ కేర్ సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డా.వాసుదేవ్ చతుర్వేదికి ‘బెస్ట్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును, ఫిన్టెక్ కంపెనీల్లో ఒకటైన జాగిల్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డా.రాజ్ నారాయణంకు ‘ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆఫ్ ది ఇయర్ 24-25’ అవా ర్డును అందించారు.
ఈ సందర్భంగా కమడోర్ మాధవరావు మాట్లాడుతూ.. ఇలాంటి అవార్డులతో గుర్తింపు సాధించామన్న సంబరాలే కాదని, తదుపరి తరం నాయకులకు ఒక స్ఫూర్తిని రగిలిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో హెచ్ఎంఏ కార్యదర్శి అల్వాల దేవేందర్రెడ్డి, అధ్యక్షుడు కే చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.