17 April, 2026 | 2:42 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఎంఎస్‌ఎంఈలకు బీడీఎల్ ఊతం

09-06-2025 02:36 AM
  1. ఆత్మనిర్భర భారత్ స్ఫూర్తితో ముందుకు..
  2. హెచ్‌ఎంఏ వార్షిక అవార్డుల ప్రదానంలో రిటైర్డ్ కమడోర్ మాధవరావు

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): భారత్ డైనమిక్ లిమిటెడ్(బీడీఎల్) కేవలం దేశ భద్రతను బలోపేతం చేయడమే కాకుం డా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని దాదాపు 3,200 ఎంఎస్‌ఎంఈలకు ఊతమిచ్చి, స్వదే శీ సామర్థ్యాన్ని, సృజనాత్మకతను కూడా పెంపొందించిందని ప్రముఖ వ్యూహాత్మక ఆలోచనల నిపుణుడు, రిటైర్డ్ కమడోర్ మాధవరావు తెలిపారు.

ఆత్మనిర్భర భారత్ స్ఫూర్తిని కూడా బీడీఎల్ ప్రదర్శిస్తుందన్నా రు. మేనేజ్‌మెంట్, సృజనాత్మకత, డిఫెన్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వంటి రంగాల్లో అపారమైన సేవలు అందించిన పలువురు వ్యక్తు లు, సంస్థలను హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్(హెచ్‌ఎంఏ) వార్షిక అవార్డు ల ప్రదాన కార్యక్రమంలో సత్కరించింది.

రిటైర్డ్ వింగ్ కమాండర్ ఆవుల భరత్‌భూషణ్‌కు జీవన సాఫల్య అవార్డును, స్వస్థవ క్యాన్సర్ కేర్ సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డా.వాసుదేవ్ చతుర్వేదికి ‘బెస్ట్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును, ఫిన్‌టెక్ కంపెనీల్లో ఒకటైన జాగిల్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డా.రాజ్ నారాయణంకు ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆఫ్ ది ఇయర్ 24-25’ అవా ర్డును అందించారు.

ఈ సందర్భంగా కమడోర్ మాధవరావు మాట్లాడుతూ.. ఇలాంటి అవార్డులతో గుర్తింపు సాధించామన్న సంబరాలే కాదని, తదుపరి తరం నాయకులకు ఒక స్ఫూర్తిని రగిలిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో హెచ్‌ఎంఏ కార్యదర్శి అల్వాల దేవేందర్‌రెడ్డి, అధ్యక్షుడు కే చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.