18 August, 2026 | 3:52 AM

ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై అప్రమత్తత!

18-08-2026 12:00 AM
  1. ధూమపానం చేయనివారికీ ముప్పే!
  2. తొలిదశలో గుర్తిస్తే ప్రాణాలు కాపాడొచ్చు
  3. అపోలో ఆస్పత్రి డాక్టర్ నిఖిల్ ఘడియాలపాటిల్ 

హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాం తి): ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే కేవలం ధూమపానం చేసేవారికే వస్తుందనుకోవ డం అపోహేనని అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్ మెడికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ ఘడియాలపాటిల్ తెలిపారు. వా యు కాలుష్యం, సరైన వెంటిలేషన్ లేని వం టగదుల్లో పొగ, రసాయనాలకు సంబంధించిన వృత్తిపరమైన పరిచయం, జన్యుపర మైన కారణాలు కూడా ఊపిరితిత్తుల క్యాన్స ర్కు దోహదం చేస్తాయని వివరించారు.

రెండు, మూడు వారాలకు మించి కొనసాగే దగ్గు, దగ్గుతో రక్తం పడటం, లోతుగా శ్వాస తీసుకున్నప్పుడు పెరిగే ఛాతీ నొప్పి, కారణం తెలియని శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతు బొంగురుపోవడం, అకారణంగా బరువు తగ్గడం, పదేపదే ఛాతీలో ఇన్ఫెక్షన్లు రావడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. ఇవన్నీ క్యాన్సర్ లక్షణాలే కావాల్సిన అవసరం లేకపోయినా.. తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించి కారణాన్ని తెలుసుకోవాలని చెప్పారు.

ఊపిరితిత్తుల క్యాన్సర్ తొలిదశలో ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే ఉండే అవకాశముందని డాక్ట ర్ నిఖిల్ తెలిపారు. ఎక్కువగా, దీర్ఘకాలంగా ధూమపానం చేసిన 50 ఏళ్లు పైబడిన వారికి వైద్యుల సలహా మేరకు లో-డోస్ సీటీ స్కాన్ చేయించుకోవడం ఉపయోగకరమని చెప్పారు. తొలిదశలోనే క్యాన్సర్ను గుర్తిస్తే చికిత్స ద్వారా పూర్తిగా నయం చేసే అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.

గత పదేళ్లతో పోలిస్తే ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సలో గణనీయమైన మార్పులు వచ్చాయని డాక్టర్ నిఖిల్ వివరించారు. గతంలో నాలు గో దశ ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే కొద్దికాలం మాత్రమే జీవించే పరిస్థితిగా భావిం చేవారని.. ప్రస్తుతం ఆధునిక చికిత్సలతో స్టేజ్-4 క్యాన్సర్ ఉన్న పలువురు రోగులు ఐదేళ్లకు మించి సాధారణ జీవితం కొనసాగిస్తున్నారని చెప్పారు.