25-06-2025 12:36:05 AM
- చెల్లిన పదార్ధాలు
- వాటితోనే కేకులు స్వీట్లు తయారు
- ఫాస్ట్ ఫుడ్ , రెస్టారెంట్లలోనూ నిబంధనలు బేజారు
- నాణ్యత లేని మాంసంతో బిర్యానీలు
గోదావరిఖని జూన్ 24విజయ క్రాంతి: కేకు కోసం బేకరీకి వెళ్తున్నారా..? అయితే బీ కేర్ ఫుల్... ఇంకా మిత్రులతో కలిసి ఫాస్ట్ ఫు డ్ , బిర్యానీ సెంటర్లకు వెళ్తున్నారా..? అక్కడ నోరూరించే పదార్థాలను తింటున్నారా..? అయితే మీ ఆరోగ్యానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం.. ఇది మాత్రం వాస్తవం.. ఎం దుకంటే రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఇటీవల కాలంగా గుట్టు చప్పుడు గాకుండా కాలం చెల్లిన, నాణ్యత లోపించిన ఆహార ప దార్థాలను వినియోగదారులకు అంటగట్టి వ్యాపారులు మోసం చేస్తున్నారు. నగర పా లక సంస్థ అధికారులు అప్పుడప్పుడు జరిపి న తనిఖీల్లో ఖచ్చితంగా ఏదొక బేకరీ గానీ, రెస్టారెంట్లో లో ఈ తరహా మోసాలు బయటపడటం ప్రజలను విస్మయానికి గురి చేస్తుంది...
మొన్నటికి మొన్న రెండు సంఘటనలు...
కాగా, కార్పొరేషన్ అధికారులు గోదావరిఖనిలో జరిపిన దాడుల్లో ఇటీవల రెండు సంఘటనలు వెలుగుచూశాయి. లక్ష్మీనగర్ లోని ఓ బేకరీ షాపులో కాలం చెల్లిన ముడి పదార్థాలతో కేకులు, స్వీట్లు తయారు చేస్తున్నట్లు నిర్ధారించారు. ఇక ఇంజిన్ అయిల్ ను పోలిన నల్లటి నూనెలో సమోసాలు, ఎగ్ బఫ్ , కర్రీపఫ్ లు తయారు చేస్తున్నట్లు బ యటపడింది. పాడైపోయిన కేకులు, సమోసాల నుంచి వాసన రాకుండా చల్లేందుకు కాలం చెల్లిన రసాయనాలను కూడా వాడుతున్నారు.
మరుసటి రోజు మార్కండేయ కాలనీలోని ఓ రెస్టారెంట్లో తనిఖీ చేయగా, అక్కడ ఇదే తంతు బయటపడింది. ఈ రెండు షాపుల నిర్వాహకులకు అధికారులు జరిమానాలు విధించి చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి మోసాలు గో దావరిఖనిలోని మిగతా బేకరీలు, కర్రీ, బిర్యానీ పాయింట్లు, పాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లలో కూడా జరుగుతున్నాయన్న అను మానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూ డా పలు రెస్టారెంట్లలో రెండు, మూడు రోజు ల పాటు నిల్వ ఉన్న కోడిమాంసంతో వివిధ రకాల పదార్థాలు తయారు చేస్తున్నట్లు గు ర్తించారు. ఐతే రెండు మూడు నెలలకు ఒకసారి మాత్రం సాధారణ తనిఖీలు చేపట్టి ఏ దొక షాపుకు జరిమానా విధించి ఆపై చేతు లు దులుపుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి.
పుట్టగొడుగుల్లా బిర్యానీ సెంటర్లు... బేకరీలు
కాగా, గోదావరిఖని ప్రధాన చౌరస్తా నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఇటీవల కాలంగా పుట్టగొడుగుల్లా బిర్యానీ సెంటర్లు వెలిశాయి. కేవలం రూ.99కే బిర్యానీ అంటూ బోర్డులు పెట్టారు. వినియోగదారులను మరింత ఆకర్షించుకు నే విధంగా బిర్యానీలో ఏమైనా ఫ్లేవర్ కోసం రసాయనాలు విలీనం చేస్తున్నారా..? లేదా అన్నది ఫుడ్ ఇన్స్పెక్టర్ పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మోసాలపై నిఘా ఉం చి బయటపెట్టాల్సిన బాధ్యత అటు టాస్క్ ఫోర్స్ విభాగంపై కూడా ఉంటుంది.
కానీ రెండు శాఖల అధికారులు మాత్రం తమ బా ధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అందువల్లనే నగరం లో ఇలాంటి బేకరీలు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, పచ్చళ్ల కేంద్రాలలో మోసాలు య థేచ్ఛగా జరుగుతున్నాయని ప్రచారం జరుగుతుంది. నెలనెల మామూళ్లు ఇచ్చే వ్యాపా రుల జోలికి వెళ్లడం లేదన్న అపవాదు కా ర్పొరేషన్ కు ఉంది. ఓ రాజకీయ నాయకుడి కనుసన్నల్లోనే కార్పొరేషన్లోని పలు విభాగాల అధికారులు నడుచుకుంటున్నట్లు ఆరో పణలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. దాంతో నగరంలో ఇలాంటి భారీ మోసాల కు పాల్పడుతున్న వ్యాపారుల జోలికి మా త్రం వెళ్లడం లేదని తెలుస్తోంది.
కార్పొరేషన్ పై ఆ లీడర్ పెత్తనం..
కాగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు రామగుండం కా ర్పొరేషన్ పై పెత్తనం చలాయిస్తున్నట్లు బ యట ప్రచారం జరుగుతుంది. సదర్ నాయకుడు చెప్పినట్టే నడుచుకోవాల అంటూ కా ర్పొరేషన్ లోని పలు విభాగాల అధికారులు సైతంలో లోపల కుములుకుంటున్నట్లు తెలిసింది. వాచ్మెన్ నుంచి మొదలు కమిషనర్ వరకు సదర్ నాయకుడి కనుసన్న లోనే పని చేస్తున్నారన్న ప్రచారం రామగుండంలో చర్చనీఅంశంగామారింది.