calender_icon.png 25 June, 2025 | 4:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు భరోసా సంబురాలు

25-06-2025 12:37:24 AM

హనుమకొండ, జూన్ 24 (విజయ క్రాంతి): 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు వ్యవసాయ భరోసా కింద రైతులకు జమ చేసినందుకు కృతజ్ఞతలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి నాగేశ్వరావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె. ఆర్ నాగరాజు ఫోటోలకు 66 వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కనపర్తి కిరణ్ ఆధ్వర్యంలో పాల అభిషేకం నిర్వహించి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి  ఎల్‌ఐసి వెంకన్న, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీసం సురేందర్ రెడ్డి, మాజీ చైర్మన్లు జన్ను రవీందర్,  ఆరెల్లి వెంకటస్వామి, బస్కురి శ్రీనివాస్, పుల్ల రవీందర్, మండల యూత్ అధ్యక్షులు వీర సుధాకర్,  డివిజన్ యూత్ అధ్యక్షులు తాళ్ల మధు, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గొర్రె కిరణ్, కాంగ్రెస్ నాయకులు పెద్దమ్మ నరసింహ రాములు, జన్ను రమేష్, వల్లల గంగాధర్, ఎన్టీఆర్ మొగిలి, మేకల రవీందర్, పెద్దమ్మ సురేష్, పల్లపు అనూష కిరణ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మానుకోట జిల్లాలో..

మహబూబాబాద్, జూన్ 24 (విజయ క్రాంతి): రైతు భరోసా వేడుకలు మానుకోట జిల్లాలో సంబరంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల్లో రైతు వేదికల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖాముఖీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు. మహబూబాబాద్ పట్టణంలోని ఏటిగడ్డ రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు.

సీఎం ప్రసంగాన్ని ఆధ్యాంతం రైతులు ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ వానాకాలం 2025 కి సంబంధించి జిల్లాలో  2,05,789 మంది రైతులకు రైతు భరోసా రూపాయలు 243, 45,70,876 రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు శ్రీనివాస రావు, మురళీ, హార్టికల్చర్ అధికారి జి.మరియన్న పాల్గొన్నారు.