ఫిర్యాదుదారులతో మర్యాదగా నడుచుకోవాలి

28-04-2024 01:50:31 AM

ఎస్పీ రక్షితా కే మూర్తి 

వనపర్తి, ఏప్రిల్ 27 (విజయక్రాం తి): పోలీస్‌స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో పోలీసులు మర్యాదగా నడచు కోవాలని, వారి స్నేహపూర్వకంగా మెలిగి కేసులను పరిష్కరించాలని ఎస్పీ రక్షితా కే మూర్తి  ఆదేశించారు. వనపర్తిలోని ఎస్పీ కార్యాలయంలో శనివారం వర్టికల్ ఇంచార్జులు, పోలీ సు అధికారులతో నిర్వహించిన సమీ క్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజలకు పోలీస్‌శాఖపై మరింత నమ్మ కం పెంచేలా వ్యవహరించాలని సూచించారు. ఫంక్షనల్ వర్టికల్ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. వ్యాపార సముదాయా లు, సాధారణ వీధుల్లో సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించాలన్నారు. దీనిలో ప్రజలను భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెం ట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు చేపట్టాల న్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ రామదాసు తేజావత్, డీఎస్పీ వెంకటేశ్వరావు, సీఐలు పాల్గొన్నారు.