వనపర్తి కలెక్టర్ సంతోష్
వనపర్తి (గద్వాల), ఏప్రిల్ 27 (విజయక్రాంతి): వచ్చే ఐదురోజులు జిల్లాలో వడగాడ్పులు ఉంటాయని, 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సంతోష్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి సాయం త్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ఎవరైనా వడదెబ్బకు గురైతే సమీప ప్రాథమిక, ఏరియా, జిల్లా ప్రభుత్వాసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలన్నారు. ఉపాధి హామీ అధి కారులు పనిప్రదేశాల్లో కూలీలకు తాగునీటి వసతి కల్పించాలని ఆదేశించారు. వైద్యారోగ్యశాఖ అధికారులు సర్కార్ దవాఖానల్లో తగిన ప్రాథమిక చికిత్స కిట్లతోపాటు మెడిసిన్ను అం దుబాటులో ఉంచాలని సూచించారు.