20-06-2025 08:55:16 PM
తాడ్వాయి (విజయక్రాంతి): సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తాడ్వాయి ఎస్సై మురళి(SI Murali) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి ఉన్నత పాఠశాలలో శుక్రవారం సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థినిలకు ఏదైనా ఇబ్బందులు ఏర్పడినప్పుడు షీ టీమ్ లను సంప్రదించాలని కోరారు. షీ టీమ్లు ఎలా పనిచేస్తాయి అనే విషయమై విద్యార్థులకు వివరించారు. తల్లిదండ్రులు ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు నగదు, బంగారు ఆభరణాలు వెంటబెట్టుకుని ఇంటికి తాళం వేసి వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో షీ టీం సిబ్బంది శ్రీనివాస్ ప్రధానోపాధ్యాయురాలు సుప్రజ ఉపాధ్యాయులు గిరి తదితరులు పాల్గొన్నారు.