calender_icon.png 21 June, 2025 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానుకోట విద్యుత్ శాఖ ఎస్ఈ గా శ్రీనివాసచారి

20-06-2025 08:52:50 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) ఎన్ పీడీసీఎల్ ఎస్ఈ గా ఖమ్మం జిల్లా ఎస్ ఈ శ్రీనివాసచారికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఎన్పీడీసీఎల్ సీఎండి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ ఈ గా విధులు నిర్వహించిన నరేష్ 80 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో, ఆయన స్థానంలో ఖమ్మం ఎస్ ఈ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసచారికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు శ్రీనివాసాచారి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.