20-06-2025 08:52:50 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) ఎన్ పీడీసీఎల్ ఎస్ఈ గా ఖమ్మం జిల్లా ఎస్ ఈ శ్రీనివాసచారికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఎన్పీడీసీఎల్ సీఎండి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ ఈ గా విధులు నిర్వహించిన నరేష్ 80 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో, ఆయన స్థానంలో ఖమ్మం ఎస్ ఈ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసచారికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు శ్రీనివాసాచారి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.