calender_icon.png 10 February, 2026 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించండి

10-02-2026 12:00:00 AM

షాద్‌నగర్ డీసీపీ శిరీష

షాద్ నగర్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని షాద్ నగర్ డీసీపీ శిరీష అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ఏసీపీ లక్ష్మీనారాయణ తో కలాసి మినీ స్టేడియం లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూట్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్,కౌంటింగ్ హాల్ ను పరిశీలించారు.. ఈ సందర్భంగా డీసీపీ శిరీష మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు పాటించాలని,

ఎన్నికల సిబ్బంది తమ వాహనాలను ఐబీ గెస్ట్ హౌస్ వద్ద నిలపాలని, ఎన్నికలకు సంబంధించిన వాహనా లను మాత్రమే లోపలికి అనుమతించాలని తెలిపారు..కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్నికల సామాగ్రి తలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ విజయ్ కుమార్, ఎనికల సిబ్బంది తదితరులున్నారు ..