calender_icon.png 21 June, 2025 | 10:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీకి నిధుల సేకరణ కోసం బిక్షాటన

21-06-2025 01:35:20 AM

ఇంటీంటికి తిరిగి జోలె పట్టి బిఆర్‌ఎస్ బిక్షాటన 

తలకొండపల్లి, జూన్ 20 : తలకొండపల్లి మండలంలోని గట్టిపల్లి గ్రామంలో  శుక్రవారం బీఆర్‌ఎస్ నేతలు విన్నూత నిరసనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం  గ్రామపంచాయతీలకు  నిధులు కేటాయించక పోవడంతో పారిశుద్ధ్యం  అస్తవ్యస్తంగా మారిందని బీఆర్‌ఎస్ నేతలు ఆవేదన వ్య క్తం చేశారు. పంచాయతీలో నిధులు లేక ఇంటింటి కి తిరిగే చెత్త సేకరణ  ట్రాక్టర్ నిలిపివేశారని వారు మండిపడ్డారు.

దీంతో  పంచాయతీ నిర్వహణకు  నిధుల సేకరణ కోసం  జోల పట్టిన బి ఆ ర్‌ఎస్ నేతలు ఇంటింటికి తిరిగి భిక్షాటన చేశారు. భిక్షాటన ద్వారా వచ్చిన  రూ.11,350  వేల ను పంచాయతీకి అందజేశారు. పంచాయతీ పాలకవర్గ ముగిసి 16 నెలలు అవుతుంది. ఇంకా కొత్త పాలకవర్గం రాలేదు. దీంతో పంచాయతీలకు నిధులు లేక పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మా రింది. కనీసం చెత్త సేకరించే టాక్టరు కు  డీజిల్ నిర్వాహణ కూడా పంచాయతి కార్యదర్శులకు భారంగా మారింది.

దీంతో చేసేది లేక పంచాయతీ కార్యదర్శులు చెత్త సేకరణ చేసే ట్రాక్టర్ను మూలకు పడేశారు. దీంతో గ్రామ ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు. ఈ సందర్భంగా టిఆ ర్‌ఎస్ నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా పాలనలో  పంచాయతీలు కూనరిల్లుతున్నాయని... పంచాయతీ లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు భిక్షాటన కార్యక్రమం చేపట్టినట్లుపేర్కొన్నారు.